Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб రైతు పొలం దున్నుతుండగా, నాగలికి చిక్కుకున్న బంగారు లింగం! |ప్రవీణ్ మోహన్| в хорошем качестве

రైతు పొలం దున్నుతుండగా, నాగలికి చిక్కుకున్న బంగారు లింగం! |ప్రవీణ్ మోహన్| 11 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



రైతు పొలం దున్నుతుండగా, నాగలికి చిక్కుకున్న బంగారు లింగం! |ప్రవీణ్ మోహన్|

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom   Facebook..............   / praveenmohantelugu   Instagram................   / praveenmohantelugu   Twitter......................   / pm_telugu   Email id - [email protected] మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan   Hey guys, ఈ రోజు మనం ఒక పురాతన భూగర్భ ఆలయానికి వెళ్తున్నాము. అయితే ఈ ఆలయం భారతదేశంలో లేదు, ఇండోనేషియా దేశంలో ఉంది. అవును, నేను ఇండోనేషియా దేశంలోని సంబిసారి అనే చిన్న గ్రామంలో డ్రైవింగ్ చేస్తున్నాను. ఈ భూగర్భ ఆలయాన్ని పరిశీలించి, అది మనకు ఏమి అందిస్తుందో చూద్దాం. మనం ఇప్పుడు సంబిసరి గ్రామానికి చేరుకున్నాము, ఇక్కడ మీరు, ఈ వాహనాలన్నీ తిరగడాన్ని అలానే కొన్ని shopsలను కూడా చూడవచ్చు. So, ఇది సంబిసారి గ్రామం యొక్క నేల స్థాయి. నేను ఇప్పుడు, వారు కనిపెట్టిన పురాతన ఆలయాన్ని మీకు చూపిస్తాను. And ఇక్కడ మీరు చూడవచ్చు... అదే ఆ పురాతన ఆలయం మరియు ఇది సంబిసారి గ్రామం యొక్క ground level నుండి దాదాపు 50 అడుగుల దిగువన ఉంది. ఇదే ‘చండీ సంబిసారి’ అని పిలువబడే పురాతన ఆలయం మరియు ఈ ఆలయం ఎంత పాతది? ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారని, అంటే 1,200 సంవత్సరాల నాటిదని archeologistలు చెప్తున్నారు. కానీ, ఈ ఆలయం, ఈ అంచనా కంటే 10 రెట్లు పురాతనమైనదని స్థానికులు చెప్తున్నారు. అంటే, ఈ ఆలయాన్ని 12,000 సంవత్సరాల క్రితం నిర్మించి ఉండవచ్చు. ఒక్కసారి వెళ్లి, లోపల ఏముందో చూద్దాం రండి! So, ఇక్కడ, మీరు ఈ విగ్రహాన్ని చూడవచ్చు. ఆమె ఎవరు? ఆమె దుర్గా అని పిలువబడే హిందూ మాతృ దేవత. ఇక్కడ మీరు ఆమెను, చక్రం మరియు త్రిశూలంతో చూడవచ్చు మరియు ఇక్కడ మీరు, ఆమె క్రింద ఒక గేదెను చూడవచ్చు. And ఈ గేదెకు వెలుపల, ఒక రాక్షసుడు బయటకు వస్తున్నాడు చూడండి. ఈ రాక్షసుడిని, మహిషాసుర అని అంటారు, అలానే ఇక్కడ, మాతృ దేవత దుర్గాదేవి, ఈ రాక్షసుడిని చంపుతోంది. ఇప్పుడు, ఇది ఒక హిందూ దేవాలయం అని నిర్ధారిస్తుంది మరియు ఇందులో నిజంగా విచిత్రం ఏమంటే...ఈ విగ్రహం కాదు, దీని పైన ఏముందో అది. ఈ బొమ్మలో ఉన్నది ఎవరు? ఈ బొమ్మను కాలా అంటారు. ఇప్పుడు, హిందూ మతంలో కాలా అంటే ఏమిటి? దాన్నే సమయం అని అంటారు మరియు ఈ పురాతన ఆలయానికి, ఈ చెక్కడం చాలా సరైనది. ఎందుకు? దీనికి చాలా interesting అయినా కథ ఉంది: 1966వ సంవత్సరంలో అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం, ఈ భూమిని కలిగి ఉన్న ఓ రైతు, భూమిని దున్నుతుండగా అతని నాగలికి ఏదో చిక్కుకుపోయింది. అతను, ఆ నాగలిని కదపడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు, కానీ నాగలి ఒక్క అంగుళం కూడా కదలలేదు. అప్పుడు అతను త్రవ్వడం ప్రారంభించాడు, లోపల అతను కనుగొన్నది చాలా ఆశ్చర్యపరిచింది. ఇంతకీ అతను లోపల ఏమి కనుగొన్నాడు? అతను లింగంలా కనిపించేదాన్ని కనుగొన్నాడు - పైన సిలిండర్ మరియు దాని క్రింద ఒక square baseతో ఉన్న ఒక లింగంను కనిపెట్టారు. అతనికి లింగం దొరికిందా, నాగలి లింగంలో చిక్కుకుందా? లేదు, అది లింగం కాదు. అతని నాగలి, ఆలయ గోపురం పైభాగంలో ఇరుక్కుపోయింది. మీరు గమనిస్తే, ఇది ఒక లింగం వలె కనిపిస్తుంది, కదా? కానీ అతని నాగలి, ఆలయ గోపురం పైభాగంలో ఇరుక్కుపోయింది. కొద్దిసేపటికే గ్రామస్తులు ఈ విషయం విని, వారు వందల సంఖ్యలో రావడం ప్రారంభించారు. అప్పుడు వారు ఈ ఆలయాన్ని వెలికి తీయడం ప్రారంభించారు మరియు ఈ ఆలయం భూమి నుండి బయటకు రావడం ప్రారంభించింది మరియు ఇండోనేషియా ప్రభుత్వానికి దీని గాలి వచ్చింది. And వారు వచ్చి, ఇది జాతీయ నిధి అని చెప్పారు ... ఇది ప్రభుత్వానికి చెందిన అద్భుతమైన పురాతన ఆలయం, మరియు ఈ భూమిని వారు స్వాధీనం చేసుకున్నారు. లేదంటే కనీసం, రైతు నుంచి, ఈ భూమినైనా తీసుకోవాలని కోరుకున్నారు. ఈ భూమిని ప్రభుత్వానికి ఇవ్వడానికి రైతు ఇష్టపడలేదు. ఎందుకు? ఎందుకంటే, ఇది బంగారు దిగుబడి వచ్చే భూమి, అర్ధం ఏంటంటే ఏడాదికి మూడుసార్లు వరి పండించగలిగానని చెప్పాడు. మరియు, ఆలయానికి కుడివైపున ఉన్న ఈ భూమిలో, పంటలు ఎల్లప్పుడూ ఇతర భూమి కంటే మూడు రెట్లు పెరుగుతాయని చెప్పారు. So, అతను ఈ భూమిలో మూడు రెట్లు, బంగారు దిగుబడిని పొందుతున్నాడు. కాబట్టి, ఈ భూమిని ప్రభుత్వానికి ఇవ్వకూడదని అనుకున్నాడు, కానీ అతను దానిని ప్రభుత్వానికి ఇవ్వవలసి వచ్చింది. ఇప్పుడు, ఈ భూమి బంగారు దిగుబడిని ఎందుకు ఇచ్చిందని గ్రామస్తులు ఎప్పుడూ ఆలోచిస్తున్నారని చెప్పారు. సాధారణ ఒక భూమి, మూడు రెట్లు పంటలు ఎలా తిరిగి ఇవ్వగలిగింది? ఈ భూమికి ఏదైనా ప్రత్యేకత ఉందా, మరియు ఈ ఆలయంలోని విగ్రహాలు బంగారు దిగుబడికి కారణమా? ఈ విగ్రహాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది గణేశుడు విగ్రహం, ఇక్కడ అతను సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోవడం మీరు చూడవచ్చు. మీరు క్రింద చూస్తే, అతను నిజంగా తామర పువ్వుపై కూర్చున్నాడు మరియు అతని కిరీటంపై మీరు చంద్రవంకను చూడవచ్చు. కానీ ఇది ముఖ్యమైన భాగం కాదు. ఈ ప్రాంతం యొక్క ముఖ్యమైన భాగం మళ్లీ: కాలా, అంటే సమయం. ఇప్పుడు, ఈ కథ 1966లో ముగియలేదు, ఎందుకంటే 11 సంవత్సరాల తరువాత, 1977లో, archeologistలు ఇప్పటికీ ఆలయాన్ని వెలికితీస్తున్నారు మరియు వారు సంచలనాత్మకమైనదాన్ని కనిపెట్టారు. Archeologist, స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఒక ప్లేట్‌ను కనిపెట్టాడు మరియు ఈ ప్లేట్‌లో ఒక విచిత్రమైన శాసనం ఉంది. ఈ శాసనంలో, సంస్కృతంలో మూడు పదాలు మాత్రమే వ్రాయబడ్డాయి. ఇది ఏం చెప్పింది? ఓం శివ స్థాన. ఇప్పుడు, దీని అర్థం ఏంటంటే ‘శివుని పవిత్ర గృహం’ అని అర్ధం. ఇండోనేషియా చరిత్రలో, ఇది చాలా అరుదు, ఎందుకంటే ఇండోనేషియాలో శాసనాలు చాలా అరుదుగ ఉంటాయి. మీరు సాధారణంగా శాసనాలను చూడలేరు, ఒకవేళ మీరు శాసనాలను చూసినప్పటికీ, మీరు రాతిపై వ్రాసిన శాసనాలను మాత్రమే కనుగొంటారు. కానీ దీన్ని, ఒక బంగారు పళ్ళెంలో కనిపెట్టారు మరియు దాన్ని ఈ ఆలయంలో పాతిపెట్టారు. స్వచ్ఛమైన బంగారంతో చేసిన ప్లేట్‌పై ఈ పదాలను ఎందుకు చెక్కారు? #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #indonesia #hindu #hinduism

Comments