У нас вы можете посмотреть бесплатно అబద్దాన్ని నిజం చేసేందుకు రాష్ట్రంలో విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
అబద్దాన్ని నిజం చేసేందుకు రాష్ట్రంలో విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూపిస్తూ పదేపదే సోషల్ మీడియాలో వక్రీకరించి చూపిస్తూ అబద్దాలను నిజం చేయడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు, శుక్రవారం ఉదయం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రం లో గ్రామ రక్షక దళం ఆవిష్కరణోత్సవం జరిగింది.మనమతం -మానవత్వం , మనదైవం - సమానత్వం ,మన గమ్యం - మత సౌబ్రాత్రత్వం అనే ఉద్దేశ్యంతో చిత్తూరు జిల్లా పోలీసులు గ్రామ రక్షక దళం ప్రారంభించారు.ఈసందర్భంగా జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ , మాట్లాడుతూ ఒక మతం పై పదే పదే దాడులు జరుగుతున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు మతవిద్వేషాలు రెచ్చకొడితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. జిల్లాలో పదివేల మందితో గ్రామ రక్షక దళం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈవ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లాలోని ప్రతి దేవాలయం ,మసీదు ,చర్చి లను కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. ఈకార్యక్రమంలో ఏ ఎస్పి మహేష్ , చిత్తూరు సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఎన్. సుధాకర్ రెడ్డి , చిత్తూరు క్రైమ్ డి ఎస్ పి శ్రీనివాస మూర్తి ,ట్రాఫిక్ డి ఎస్ పి .తెప్పేస్వామి ,సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు వివిధ మతాలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు.